రంగులు మార్చే శివలింగం...
రామసేతువుకు తలెత్తిన ముప్పుతో శివలింగం రంగు మార్చుకుంటున్నదా? నమ్మండి నమ్మకపోండి, వారణాసిలోని శివలింగాలకు తోడుగా లక్నో నగరంలోని శివలింగాలు కూడా తమ రంగులను మార్చుకుంటున్నాయి. ఒకేరోజులో శివలింగాలు తమ రంగును మార్చుకున్న వైనం, కొన్ని సంవత్సరాల క్రితం తూర్పు భారతంలో విఘ్నేశ్వరుని విగ్రహాలు పాలు తాగిన ఉదంతాన్ని గుర్తుకు తెస్తుంది.ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి లక్నోలోని ఛారోధామ్ దేవాలయంలో శివలింగం రంగు మార్చుకున్న సంగతి తెలియగానే, దేవాలయానికి చేరుకున్న అనేక మంది భక్తులు శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు నల్లరంగులోని శివలింగం తెల్లరంగులోకి మారడంతో ఈ సంఘటన బహుళ ప్రాచుర్యానికి నోచుకుంది. ఈ
సంఘటన భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు పురప్రముఖులలో ఒకరైన కుందన్లాల్ జ్యుయలెర్స్ యజమాని అతుల్ అగర్వాల్తో పాటు దేవాలయ గౌరవ ధర్మకర్తలు దేవాలయానికి చేరుకున్నారు. చౌపాటియాలో నెలకొన్న ఛారోధామ్ సిధ్ధపీఠ్ దేవాయలయ పూజారి సియారామ్ అవస్థి ఈ సంఘటనను భగవంతుని లీలగా విశ్వసిస్తున్నారు.చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి
పాత లక్నోలోని ఈ ప్రాంతానికి 'చోటా కాంచీ' అనే మరో పేరుంది. ఛారోధామ్ దేవాలయం మరియు 'బడీ కాళీజీ'లు ఈ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు రామేశ్వరం, బదరీనాధ్, కేదారనాధ్, ద్వారకాదేశ్ మరియు జగన్నాధ్లను కూడా సేవించవచ్చు. ఇక్కడ స్వర్గ నరకాలను సైతం మీరు చూడవచ్చు. ఈ దేవతామూర్తిని పురావస్తు శాఖ విభాగం వారు నమోదు చేసుకున్నారని సియారామ్ అవస్థి మాతో అన్నారు. ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండిఛారోధామ్కు చెందిన ఈ దేవాలయం, రామేశ్వరంలోని రామేశ్వరం దేవాలయాన్ని పోలి ఉంటుంది. దేవాలయంలోని ప్రధాన శివలింగానికి సమీపంలో రామసేతువు నమూనా ఉంది. రావణాసురుని సభను కూడా ఇక్కడ చూడవచ్చు. ఇదిలా ఉండగా మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ రామేశ్వరంలోని నిజదేవాలయంలోని శివలింగం