శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 నవంబరు 2014 (17:44 IST)

మొదటి ఘాట్‌లో అక్కగార్లకు ప్రత్యేక పూజ... ప్రసాదం

తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం ఉదయం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని అక్కదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం రవాణా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. టీటీటీ తిరుమల జేఈవో శ్రీనివాస రాజు ఈ ప్రత్యేక పూజలకు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, అవ్వాచారి కోన సమీపంలో ఉన్న ఈ అక్క దేవతలు తాము ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతారని భక్తులు భావిస్తారన్నారు. భక్తుల నమ్మకాలను గౌరవిస్తూ కార్తీక మాసంలో ఈ ప్రత్యేక పూజలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్టు జిఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవో క్రిష్ణా డ్డి, తిరుమల శ్రీ నాయుడు తదితరులు పాల్గొంటున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు.