శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 నవంబరు 2014 (20:49 IST)

నరసింహ స్వామికి అభిషేకం

తిరుపతికి సమీపంలోని అలిపిరి కాలినడక మార్గం ఉన్న నరసింహ స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం అభిషేకం నిర్వహించింది. నరసింహ జయంతిని పురస్కరించుకుని తోవ నరసింహ స్వామిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మి నరసింహ స్వామికి ఉదయం తిరుమల జేఈవో శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. 
 
వైశాఖ మాసం చతుర్ధశి నాడు తిరుమలలోని నరసింహ స్వామి ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం అభిషేకం నిర్వహించింది. శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.