ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (10:27 IST)

కామన్వెల్త్ గేమ్స్ 2018 : 11 రోజుల పాటు క్రీడా పండుగ

ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడలకు రంగం సిద్ధమైంది. 71 దేశాల నుంచి 6 వేలకు పైగా ఆటగాళ్లు పాల్గొనే క్రీడా పండుగ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా 21వ కామన్వెల్త్ గే

ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడలకు రంగం సిద్ధమైంది. 71 దేశాల నుంచి 6 వేలకు పైగా ఆటగాళ్లు పాల్గొనే క్రీడా పండుగ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా 21వ కామన్వెల్త్ గేమ్స్ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరుగనుంది. 
 
ఈ పోటీలు గురువారం నుంచి మొదలవుతాయి. ఈ నెల 15వ వరకూ 11 రోజుల పాటు పోటీలు జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్‌లో మెరుగైన రికార్డు ఉన్న భారత్‌ ఈసారి 219 మంది అథ్లెట్లతో బరిలోకి దిగుతోంది. కరారా స్టేడియంలో భారత బ్యాడ్మింటన్ షట్లర్ పీవీ సింధు పతాకంతో ఆరంభ వేడుకల్లో మువ్వన్నెల జెండాతో మన బృందాన్ని ముందుండి నడిపించనుంది.
 
గత గ్లాస్గో క్రీడల్లో భారత్‌ 15 స్వర్ణాలు సహా 64 పతకాలు గెలుచుకుంది. అంతకుముందు 2010లో స్వదేశంలో జరిగిన క్రీడల్లో సెంచరీ కొట్టి అత్యుత్తమంగా రెండో స్థానం దక్కించుకుంది. ఇండియా గత ఐదు అంచెల్లో టాప్‌-5లో చోటు నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈసారి కూడా దాన్ని కాపాడుకోవడంతో పాటు గతేడాది కంటే ఎక్కువ పతకాలు నెగ్గాలని చూస్తోంది. ఈ క్రీడల్లోనూ భారత్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో నిలుస్తోంది.