శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (12:07 IST)

సింధు 'పద్మ భూషణ్'... క్రీడా శాఖ సిఫారసు

హైదరాబాద్ బాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు దేశ మూడో అత్యున్నత పురస్కారమై 'పద్మభూషణ్' కోసం కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. ఈ మేరకు సోమవారం ఆమెను పద్మభూషణ్ అవార్డు కోసం నామి

హైదరాబాద్ బాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు దేశ మూడో అత్యున్నత పురస్కారమై 'పద్మభూషణ్' కోసం కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. ఈ మేరకు సోమవారం ఆమెను పద్మభూషణ్ అవార్డు కోసం నామినేట్ చేసింది. 
 
ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన సింధు.. ఆపై కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‍‌ను కూడా కైవసం చేసుకున్నారు. అంతకుముందు రియో ఒలింపిక్స్‌లో పివి సింధు రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి పద్మ పురస్కారాల్లో భాగంగా పద్మభూషణ్‌కు సింధు పేరును క్రీడా శాఖ ప్రతిపాదించింది. 
 
ప్ర‌స్తుతం ప్ర‌పంచ నెం.2 ర్యాంకులో కొన‌సాగుతున్న‌ సింధు బ్యాడ్మింట‌న్‌లో వివిధ అంత‌ర్జాతీయ టోర్నీల్లో అత్యుత్తమ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రీడాశాఖ చేసిన సిఫార్సును ప్ర‌స్తుతం హోం శాఖ ప‌రిశీలిస్తుంది. ఇటీవ‌ల క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పేరును బీసీసీఐ సిఫారసు చేసిన సంగ‌తి విదిత‌మే.