1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (14:04 IST)

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

crime
వివాహేతర సంబంధం భర్తను బలిగొంది. పక్కా ప్లాన్ ప్రకారం భార్య భర్తను హతమార్చింది. ఈ కేసులో శుక్రవారం నిందితులు మృతుడి భార్య శ్రీలక్ష్మి, ఆమె ప్రియుడు రాజేశ్, రౌడీ షీటర్ రాజేశ్వర్ రెడ్డి, మహ్మద్ మైతాబ్‌ను పోలీసులు అరస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డి గూడకు చెందిన విజయ్ కుమార్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. 15 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మితో అతనికి వివాహం జరిగింది. వీరు ఇద్దరు పిల్లలతో కలిసి జయప్రకాశ్ నగర్ అపార్ట్ మెంట్‌లో వుంటున్నారు. 
 
పెళ్లికి ముందే ప్రేమించిన రాజేశ్‌తో శ్రీలక్ష్మి సంబంధాన్ని కొనసాగింది. గంటల తరబడి ఫోనులో మాట్లాడేది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి.. భర్త ఆమె చేసిన తప్పును కనిపెట్టాడు. ఈ విషయంపై భార్యాభర్తలిద్దరికి గొడవ జరిగేది. దీంతో భర్తను మట్టుబెట్టాలని భావించింది. 
 
ప్రియుడి సాయంతో రౌడీషీటర్‌ రాజేశ్వర్ రెడ్డిని బరిలోకి దించింది. పక్కా ప్లాన్ ప్రకారం శ్రీలక్ష్మి ఇంట్లోనే ఆమె భర్తను చంపేశారు. అయితే విజయ్ కుమార్ గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది. 
 
అయితే రౌడీ షీటర్ పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో అసలు సంగతి బయటికి వచ్చేసింది. దీంతో శ్రీలక్ష్మి కూడా జైలుకు వెళ్లడంతో తల్లిదండ్రులు లేని ఆ చిన్నారులు అమ్మమ్మ ఇంటికి చేరారు.