శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (12:16 IST)

తెలంగాణ ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్‌ కారుకు ప్రమాదం....

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఈ కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఈ కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వ్యక్తిని మంచిర్యాల జిల్లాకు చెందిన సుందారపు గోపాల్‌గా గుర్తించారు. 
 
కొప్పుల ఈశ్వర్ తన కుమారుడి పెళ్లి పత్రికలను వేములవాడ ఆలయంలో సమర్పించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. కొప్పుల ఈశ్వర్ డ్రైవర్ కారును డీజిల్ పోయించేందుకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కొప్పుల ఈశ్వర్ కారులో లేరు.