శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 21 ఏప్రియల్ 2018 (21:34 IST)

RGV... ఫోన్లు స్విచాఫ్ చేసి సోషల్ మీడియా నుంచి వెళ్లిపో.... లేదంటే నీకు సారీనే: సుధాకర్ నాయుడు

పవన్ కళ్యాణ్ పైన వరుస ట్వీట్లు, కామెంట్లు చేస్తున్న రాంగోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్రమైన హెచ్చరికలు వస్తున్నాయి. రాంగోపాల్ వర్మ గదిలో కూర్చుని నాటకాలు ఆడితే చూస్తూ కూర్చోవడం తమకు చేత కాదనీ, ఐతే వర్మలా కారుకూతలు కూయకుండా చక్కగా ఆయనకు

పవన్ కళ్యాణ్ పైన వరుస ట్వీట్లు, కామెంట్లు చేస్తున్న రాంగోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్రమైన హెచ్చరికలు వస్తున్నాయి. రాంగోపాల్ వర్మ గదిలో కూర్చుని నాటకాలు ఆడితే చూస్తూ కూర్చోవడం తమకు చేత కాదనీ, ఐతే వర్మలా కారుకూతలు కూయకుండా చక్కగా ఆయనకు సారీ చెప్పేస్తామని హెచ్చరించారు నటుడు జీవీ సుధాకర్ నాయుడు. 
 
'ఫోన్లు స్విచాఫ్ చేయండి. సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతే మీకే మంచిది. లేదంటే మీకు సారీ చెప్పాల్సి వస్తుంది. ఏదో ఆసుపత్రిలో బెడ్ పైన మీరు వుంటారు కనుక చెప్పక తప్పదు. మీరు ఎక్కడ వున్నా హైదరాబాద్ రావాలి కదా. ఇక్కడ మీరు తీసే సినిమాలు ఎలా విడుదల చేస్తారో, ఎక్కడ ఆడియో వేడుకలు నిర్వహిస్తారో అదీ మేము చూస్తాం" అంటూ జీవీ సుధాకర్ నాయడు హెచ్చరించారు.
 
మరోవైపు శకలక శంకర్ కూడా శ్రీకాకుళంలో జనసేన కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. పవన్ కళ్యాణ్ తమకు అన్నయ్య అనీ, అన్నయ్య తల్లి తమకు కూడా తల్లేననీ, అలాంటి తమ తల్లిని పనికిమాలిన మాటలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. కత్తి మహేష్ నుంచి శ్రీరెడ్డి వరకూ కుక్కల కంటే హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు అంటున్నది ఎవరినో తెలుసా? కాబోయే సీఎంను... పవన్ కళ్యాణ్ మహా నాయకుడు అవుతారంటూ చెప్పుకొచ్చారు.