శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By TJ
Last Modified: శుక్రవారం, 11 మే 2018 (15:05 IST)

మా కెసిఆర్‌‌కు ఆ కళ వచ్చేసిందని తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్నారా?

బిజెపికి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అప్పుడే ప్రధానమంత్రి కళ వచ్చేసినట్లుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతుబంధు పథకానికి సం

బిజెపికి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అప్పుడే ప్రధానమంత్రి కళ వచ్చేసినట్లుంది. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతుబంధు పథకానికి సంబంధించి పత్రికలకు ఇచ్చిన ప్రకటనలను చూస్తే కెసిఆర్ దేశ ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. రైతులకు పంటల సాగుకోసం యేడాదికి 8 వేల రూపాయలు ఇచ్చే రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడుతున్న కెసిఆర్ దాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు.
 
తెలుగు పత్రికలకు రెండు పేజీలు పూర్తి ప్రకటనలు ఇచ్చిన ఆయన తమిళనాడు, కర్ణాటక, కేరళ, బెంగాళ్ ఇలా ఏ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా భారీ ప్రకటనలు ఇచ్చారు. దేశ రైతాంగానికి స్వర్ణయుగం అనే శీర్షికతోనే ఈ ప్రకటనలు వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చలోక్తులు విసురుకుంటున్నారు. 
 
తను ప్రధానమంత్రి అయితే ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టగలమని దేశ ప్రజలకు చెప్పడం కావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తను భవిష్యత్తులో చేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు దీన్ని అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఈ ప్రకటనల్లో కెసిఆర్ ఫోటో తప్ప వ్యవసాయమంత్రి ఫోటో కూడా లేదు. దీనికి కారణం దేశ వ్యాప్తంగా కెసిఆర్ ఫోకస్ కావాలనుకోవడమే కావచ్చట. ఏమైనా అప్పుడే కెసిఆర్‌లో ప్రధానమంత్రి కళ వచ్చేసిందంటూ తెలంగాణా రాష్ట్ర ప్రజలు మాట్లాడేసుకుంటున్నారట.