శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 28 అక్టోబరు 2020 (10:19 IST)

అన్నతోనే ప్రేమాయణం, వద్దని వారించినా వినని యువతి చివరికి...

వరుసకు అన్న. తోడల్లుడి కుమారుడు. అయితే  ఆ యువతి అతడిని ప్రేమించింది. ఆ విషయాన్ని అతనికే చెప్పింది. తొలుత అతడు కాదన్నాడు. ఒత్తిడి చేయడంతో ఆ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఇద్దరూ అన్ని విధాలుగా దగ్గరయ్యారు. చివరకు ఇంట్లో తెలిసి మందలించారు. కానీ తను ఇష్టపడినివాడు దూరమవుతున్నాడన్న బాధతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని నార్నూల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కుమార్తె  వైష్ణవికి 15 యేళ్ళు. ఈ మధ్యే 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటి దగ్గరే ఉంటోంది. శ్రీనివాస్ భార్య ఆదిలాబాద్ నగరంలో అంగన్‌వాడీలో విధులను నిర్వర్తిస్తోంది.
 
దీంతో ఆమె అక్కడే ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన అన్న మహేష్ తరచూ ఇంటికి వచ్చేవాడు. ఏవేవో కథలు చెప్పేవాడు. అన్న కావడంతో తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అతనికి బాగా దగ్గరైపోయింది వైష్ణవి.
 
అన్నను ప్రియుడుగా మార్చేసుకుంది. మొదట్లో ఇది తప్పని చెప్పాడు మహేష్. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో ఇతనే మారిపోయి ప్రేమికుడయ్యాడు. విషయం కాస్తా ఇంట్లో తెలిసిపోయింది. వైష్ణవిని మందలించారు. ఆదిలాబాద్ నగరంలోని తల్లి ఇంటికి పంపారు. దీంతో ఆ యువతి మనస్థాపానికి గురైంది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.