శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (09:33 IST)

28 నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభం

హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌కు వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సేవలను ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌కు వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అంది. 
 
ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా అంటే 3 గంటల 25 నిమిషాలకు మియాపూర్ మెట్రో స్టేషన్ చేరుకొని… మెట్రో రైల్‌ను ప్రారంభిస్తారు. మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు 5 కిలోమీటర్లు రైలులో ఆయన ప్రయాణిస్తారు. తిరగి మియాపూర్ చేరుకుని.. అక్కడే ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 
 
మెట్రో ప్రారంభం తర్వాత హెలికాప్టర్‌లో హెచ్ఐసీసీ చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. ఆ తర్వాత ఎనమిదిన్నరకు శంషాబాద్ నుంచి తిరిగి ఢిల్లీ వెళతారు.