శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 15 జులై 2020 (15:03 IST)

అఖిల్ - వీరు పోట్ల కాంబినేషన్లో మూవీ నిజమేనా..?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది.
 
స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అఖిల్ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాదాపుగా ఈ మూవీ ఫిక్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... అఖిల్ వీరు పోట్లతో సినిమా చేయనున్నట్టు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ తర్వాత వీరు పోట్లతో సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది.
 
గతంలో వీరు పోట్ల నాగార్జునతో రగడ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించింది. అయితే.. ఇప్పుడు అఖిల్‌తో వీరు పోట్ల మూవీ అనగానే నిజమా..? కాదా..? అనేది చర్చనీయాంశం అయ్యింది. టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిన ఈ కాంబినేషన్ గురించి ఆరా తీస్తే... ఇందులో వాస్తవం లేదని తెలిసింది.
 
వీరు పోట్లను అడిగితే... అసలు తను అలాంటి ప్రయత్నాల్లో లేనని... నిజంగా అఖిల్‌ను డైరక్ట్ చేసే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనని చెప్పాడు. సునీల్‌తో ఈడు గోల్డు ఎహే అనే సినిమా తీసాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాను చేయలేదు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడని తెలిసింది.