శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (17:11 IST)

'పులస చేపలా ఎగిరెగిరి పడుతున్నావ్.. నీ అన్నయ్య వాటికి బ్రాండ్ అంబాసిడర్' .. శ్రీరెడ్డి

హీరో నానిని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ల వర్షం కురిపించిన నటి శ్రీరెడ్డి ఇపుడు మరోమారు మెగా బ్రదర్స్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది. "పలాసలో పులస చేపలా ఎగిరెగిరి పడుతున్నాడు. అన్యాయం, అక్రమం, దౌ

హీరో నానిని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ల వర్షం కురిపించిన నటి శ్రీరెడ్డి ఇపుడు మరోమారు మెగా బ్రదర్స్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది. "పలాసలో పులస చేపలా ఎగిరెగిరి పడుతున్నాడు. అన్యాయం, అక్రమం, దౌర్జన్యాల గురించి మీరే చెప్పాలి. మీ అన్నయ్య వాటికి బ్రాండ్ అంబాసడర్" అంటూ ఘాటైన పదజాలంతో ట్వీట్ చేసింది.
 
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో నేచురల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న హీరో నానిపై శ్రీరెడ్డి మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 'నాని ప్లస్ శ్రీరెడ్డి = డర్టీ పిక్చర్... ఎప్పుడు? కమింగ్ సూన్... ఆన్ ది వే' అంటూ ట్వీట్ చేసింది. నానిగాడి రాసలీలలు అన్నీ బయటపెడతానని... అంటూ ట్వీట్ చేసింది. 
 
ఇపుడు మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి విమర్శలు చేసింది. "పలాసలో పులస చేపలా ఎగిరెగిరి పడుతున్నాడు. అన్యాయం, అక్రమం, దౌర్జన్యాల గురించి మీరే చెప్పాలి. మీ అన్నయ్య వాటికి బ్రాండ్ అంబాసిడర్. ఎమ్మెల్యే సీట్లు కొనుక్కున్నవారికి కుచ్చు టోపీ, ఓట్లు వేసిన ప్రజల నోట్లో మట్టి కొట్టారు. నీ బండ పడ. సీఎం అనగానే నీ మొహం చూడాలి. సీఎం సీఎం అని ఇక్కడదాకా లాక్కొచ్చారంట. సినిమాల్లో రూ.కోట్లు ఎందుకు వదిలేశావో ఎవరికి తెలియదు నాయనా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పీకే, మెగా అభిమానులు మండిపడుతున్నారు.