గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (12:02 IST)

సర్కారు వారి పాట కోసం విలన్.. ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో విలన్ వెతికే పనిలో సినీ యూనిట్ వుంది. మహేష్ బాబును ఢీ కొట్టే పాత్ర సినిమాలో కీలక భూమిక పోషించనుంది తెలుస్తోంది. 
 
ఈ క్రమంలోనే విలన్ రోల్ కోసం ముందుగా ఉపేంద్ర, సుదీప్ లాంటి నటులను పరిశీలించిన పరశురామ్.. ఫైనల్‌గా అరవింద్‌ స్వామి అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు అరవింద్ స్వామితో సంప్రదింపుల కార్యక్రమం నడుస్తోందని సమాచారం. 
 
గతంలో తెలుగు తెరపై రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన 'ధృవ' విలన్ రోల్ చేసి మెప్పించారు అరవింద్ స్వామి. ఆ పాత్ర తీరుతన్నెలు పరిశీలించిన తర్వాతే పరశురామ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. 
 
మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్‌ ప్లస్‌ పతాకాల సంయుక్త సమర్పణలో నవీన్‌ యర్నేని, రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.