శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (20:55 IST)

#Dandupalyam3 : మరింత క్రూరంగా ట్రైలర్

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన చిత్రం 'దండుపాళ్యం'. ఈ చిత్రం తొలి భాగం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెల

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన చిత్రం 'దండుపాళ్యం'. ఈ చిత్రం తొలి భాగం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలుసు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో 'దండుపాళ్యం-2' మూవీని తీశారు. ఇప్పుడు మళ్లీ 'దండుపాళ్యం-3' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్ శనివారం రిలీజ్ చేశారు. పూజా గాంధీ, సంజన, రవి శంకర్, శృతి, సంగీత్, మక్రంద్ దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి శ్రీనివాసరాజు దర్శకత్వం వహించగా.. రజనీ తల్లూరి నిర్మాతగా ఉన్నారు. ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలు 'దండుపాళ్యం-2' కంటే మరింత క్రూరంగా ఉన్నాయి. ఆ ట్రైలర్‌ను మీరూ ఓసారి చూడండి.