శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (15:39 IST)

‘రావణా బాక్సాఫీసు సింహాసనా’... 'జై లవ కుశ' కలెక్షన్స్ వర్షం

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. ఈనెల 21వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. ఈనెల 21వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్‌లు నటించగా, పోసాని కృష్ణమురళీ, సాయికుమార్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 
 
ఈనేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు బాబీ సంతోషం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేయడంతో పాటు ‘జై లవ కుశ’ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘రావణా బాక్సాఫీసు సింహాసనా’ అని ప్రశంసించారు. సెన్సేషనల్ బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలకు పైబడి రాబట్టిందని పేర్కొన్నారు.