శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (11:21 IST)

'అర్జున్ రెడ్డి'ని వద్దన్న జాన్వి కపూర్.. ఎందుకు?

''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్ మధ్య ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సిన

''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్ మధ్య ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు పోటీపడుతున్నారు.


ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ రీమేక్‌లో షాహిద్ కపూర్, తారా సుటారియాలను హీరో హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వ బాధ్యతలు చేప్పట్టడం విశేషం. 
 
కానీ ఈ సినిమా హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా తొలుత అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వికి అవకాశం ఇచ్చారట. అయితే ఆ ఛాన్సును జాన్వి తిరస్కరించిందట. ఇందుకు కారణం లేకపోలేదండోయ్. కెరీర్ స్టార్టింగ్‌లోనే బోల్డ్ సినిమాలో కనిపిస్తే కెరీర్ అంతా అలాంటి గుర్తింపుతోనే ఉండాల్సి ఉంటుందని భావించిన బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్.. జాన్వీకి అర్జున్ రెడ్డి వద్దనే సలహా ఇచ్చారట. 
 
కరణ్ జోహార్ శ్రీదేవి కుటుంబానికి సన్నిహితుడు కావడంతో జాన్వి అర్జున్ రెడ్డిని వద్దన్నదట. ప్రస్తుతం జాన్వీ కెరీర్‌లో మొదటి సినిమాగా వస్తున్న ''ధఢక్'' సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.