శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 31 మే 2018 (10:15 IST)

భారీ వర్షంలో షూటింగ్... వరదనీటి ఉధృతికి కొట్టుకెళ్లిన సినీ దర్శకుడు

కర్ణాటక చిత్ర సీమలో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ సినీ దర్శకుడు సంతోష్ శెట్టి కటీల్ ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షంలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదనీటి ఉధృ

కర్ణాటక చిత్ర సీమలో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ సినీ దర్శకుడు సంతోష్ శెట్టి కటీల్ ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షంలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదనీటి ఉధృతికి ఆయన కొట్టుకుని పోయారు. ఒక్క‌సారిగి నీటి ఉధృతి పెర‌గ‌డం కార‌ణంగానే ఆయ‌న అదుపుత‌ప్పి నీటిలోప‌డి కొట్టుకుపోయాడ‌ని అంటున్నారు.
 
ఈ ప్రమాదం బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్‌ ఫాల్స్‌‌లో బుధవారం షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగింది. అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లంలో సంతోష్ శెట్టి కోసం వెతుక‌గా ఆయ‌న విగ‌తజీవిగా క‌నిపించారు. మృత‌దేహాన్ని బెళ్తంగ‌డికి త‌ర‌లించి, ఆ త‌ర్వాత క‌టిల్‌‌లోని ఆయన కుటుంబ స‌భ్యుల‌కి అప్ప‌గించారు. ఆయ‌న మృతికి సంతాపం ప్ర‌క‌టించింది క‌న్నడ సినీ ప‌రిశ్ర‌మ‌. దర్శకుడి మృతి పట్ల కన్నడ చిత్రసీమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది.