బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 8 జనవరి 2018 (12:45 IST)

తిరుపతిలో పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్‌‌ గోత్ర నామం చెప్పి...

పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న మహేష్ కత్తి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో పవన్ కళ్యాణ్‌, పూనమ్ కౌర్‌లు కలిసి ఏదో చేశారని, ఒకే గోత్రంతో పూనమ్ కౌర్ పూజలు కూడా చేయించారని, ఆ ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయని బాంబు

పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న మహేష్ కత్తి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో పవన్ కళ్యాణ్‌, పూనమ్ కౌర్‌లు కలిసి ఏదో చేశారని, ఒకే గోత్రంతో పూనమ్ కౌర్ పూజలు కూడా చేయించారని, ఆ ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయని బాంబు లాంటి వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఒక్కసారిగా మహేష్ కత్తి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. 
 
సరిగ్గా సంవత్సరం క్రితం పూనమ్ కౌర్ తిరుమలకు వచ్చారు. ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఆలయం లోపల ఎలాంటి పూజలు చేయించలేదు కానీ.. తిరుమలలోని అనుబంధ ఆలయాల్లో మాత్రం పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్‌ గోత్రంతో పూజలు చేయించారన్నది కత్తి మహేష్ ఆరోపణ. అది కూడా ఇద్దరి పేర్లను కలిపి చేయించారట. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. పవన్ కళ్యాణ్‌‌ను విమర్శించిన తరువాత పూనమ్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహేష్ కత్తిపై వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
 
ఇది కాస్త మహేష్ కత్తికి చిర్రెత్తుకొచ్చింది. అందుకే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా నిజానిజాలు బయటపెడుతానంటూ సవాల్ విసిరి ఆ తరువాత పవన్ కళ్యాణ్‌, పూనమ్‌ల మధ్య ఎఫైర్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్ కత్తి చెప్పినట్లు పూనమ్ కౌర్ నిజంగానే టిటిడి అనుబంధ ఆలయాల్లో అభిషేకం చేయించిందా అనే దానిపై ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది.