మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2017 (10:44 IST)

దుమ్ము దులుపుతున్న "మిడిల్ క్లాస్ అబ్బాయి"

2017 సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ యేడాది ఆఖర్లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం "మిడిల్ క్లాస్ అబ్బాయి" (ఎంసీఏ).

2017 సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ యేడాది ఆఖర్లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం "మిడిల్ క్లాస్ అబ్బాయి" (ఎంసీఏ). నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి కాంబినేషన్‌లో ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద తనదైన మార్కు వసూళ్లతో ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో రూ.20 కోట్లను వసూలు చేసినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. 
 
అయితే, ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసిన దిల్ రాజు ఆలోచనలో పడ్డారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని - భూమిక మధ్య సీన్స్ హైలైట్ అవుతాయని భావించారట. అందువలన ఆ సీన్స్‌కి ప్రాధాన్యతనిచ్చి, నాని - సాయిపల్లవి మధ్య గల నాలుగు రొమాంటిక్ సీన్స్‌ను లేపేశారట.
 
ఆ ఎఫెక్ట్ కథపై బాగానే పడిందనే టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలైన తర్వాత, హీరో.. హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ కాస్త ఘాటుగా ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అనుకుంటూ ఉండటంతో, దిల్ రాజు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అనవసరంగా ఆ సీన్స్‌ను లేపేశామని ఆయన చాలా ఫీలవుతున్నారట. కట్ చేసిన ఆ సీన్స్‌ను ఆయన యాడ్ చేస్తారా .. లేదా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దిల్ రాజు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.