శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జులై 2020 (13:03 IST)

బుల్లితెర నటి నవ్యసామికి కరోనా పాజిటివ్..

savyasami
బుల్లితెర నటులను కరోనా భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా బుల్లితెర నటి నవ్యసామికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. 'నా పేరు మీనాక్షి' మరియు 'ఆమె కథ' సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె కొద్ది రోజులుగా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుంది. దీంతో వైరస్ నిర్థారణ పరీక్ష చేయగా, పాజిటివ్ అని తేలిందట. దీంతో ఆ నటితో కాంటాక్ట్ లో వున్న వారందరూ వణికిపోతున్నారు. 
 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అలాగే తెలుగు బుల్లితెర సెలబ్రెటీల్లో కరోనా పెరిగి పోతుంది. షూటింగ్స్‌ మొదలయినప్పటి నుండి కూడా పలువురికి కరోనా ఎటాక్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది. మొదట నటుడు ప్రభాకర్‌కు వైరస్‌ సోకింది. ఆ తర్వాత ప్రభాకర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న హరికృష్ణకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. తాజాగా బుల్లితెర నటి నవ్యసామి వైరస్ బారిన పడినట్టు సమాచారం.