శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 8 అక్టోబరు 2018 (14:27 IST)

ఇంట్ర‌స్టింగ్ - మ‌హ‌ష్, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ భారీ మ‌ల్టీస్టార్..!

ఎన్టీఆర్-రాంచరణ్-మహేష్ బాబు... ఈ ముగ్గురు కలిసి ఒకే చిత్రంలో నటిస్తే... ఎలా వుంటుంది? దర్శకత్వం రాజమౌళి వహిస్తే... జూ.ఎన్టీఆర్ ఏం చెప్పారంటే... 

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించే భారీ మ‌ల్టీస్టార‌ర్ త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీ ప్ర‌మోష‌న్లో భాగంగా ఎన్టీఆర్ ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌పెట్టాడు.
 
అదే మ‌హేష్, చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి చేయాల‌నుకుంటున్న భారీ మ‌ల్టీస్టార‌ర్. అవును.. మ‌హేష్‌, చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఏమాత్రం టైమ్ దొరికినా స‌ర‌దాగా క‌లిసి మాట్లాడుకుంటుంటారు. వాళ్లు క‌లిసిన‌ప్పుడు ముగ్గురు క‌లిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంద‌నే టాపిక్ కూడా వ‌చ్చింద‌ట‌. కానీ.. ముగ్గురుని హ్యాండిల్ చేయ‌గ‌ల డైరెక్ట‌ర్ ఎవ‌రు అనే ప్ర‌శ్న‌కే స‌మాధానం దొర‌క‌లేద‌ట‌. చేస్తే.. రాజ‌మౌళినే చేయాలి అనుకున్నార‌ట‌.
 
ఈ ముగ్గురు క‌లిసి సినిమా చేయ‌డానికి రెడీ అని చెప్పాడు క‌దా ఎన్టీఆర్. మ‌రి.. ఏ రైట‌ర్ అయినా ఈ ముగ్గురికి స‌రిప‌డ స్ర్కిప్ట్ రెడీ చేస్తాడేమో చూడాలి.