శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (06:41 IST)

పీకే ఫ్యాన్స్ హింస పెడుతున్నారు... మొబైల్‌ను కూడా వాడలేక పోతున్నా : మహేష్ కత్తి

హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను హింసకు గురి చేస్తున్నారనీ, ఆ హింసను తట్టుకోలేక పోతున్నట్టు సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి జాతీయ మీడియాను ప్రాధేయపడ్డాడు. ముఖ్యంగా, పీకే ఫ్యాన్స్ నుంచి త‌నకు బెదిరింపులు వ

హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనను హింసకు గురి చేస్తున్నారనీ, ఆ హింసను తట్టుకోలేక పోతున్నట్టు సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి జాతీయ మీడియాను ప్రాధేయపడ్డాడు. ముఖ్యంగా, పీకే ఫ్యాన్స్ నుంచి త‌నకు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నాడు. పీకే ఫ్యాన్స్ త‌మ మూర్ఖ‌త్వంతో త‌న‌ను దేశవ్యాప్తంగా పాప్యుల‌ర్ చేస్తున్నార‌న్నారు. 
 
తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని అక్కడ నుంచి ఎలిమినేట్ అయిన మహేష్ కత్తి... ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో హీరో పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహించిన పీకే ఫ్యాన్స్, అప్పటి నుంచి మహేష్ కత్తితో సోషల్ మీడియా వేదికగా ఓ ఆటాడుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన గురించి ఓ జాతీయ ఛానెల్లో వచ్చిన వార్తకు సంబంధించిన వీడియోను ఆయ‌న త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ త‌న‌ను ఎలా వేధిస్తున్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న సాక్ష్యాల‌తో స‌హా చూపించాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు నిమిషానికి 10 ఫోన్ కాల్స్ చేస్తున్నార‌ని, రోజంతా ఇదే తీరు అని, దీంతో త‌న మొబైల్‌ను కూడా తాను ఉప‌యోగించుకోలేక‌పోతున్నాన‌ని అన్నాడు.