గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (21:43 IST)

రంగ‌స్థ‌లం స‌క్స‌స్ మీట్ గురించి హింట్ ఇచ్చిన ప‌వ‌న్

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ రంగ‌స్థ‌లం. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రంగ‌స్థ‌లం అంచ‌నాల‌ను మించి రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ర

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ రంగ‌స్థ‌లం. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రంగ‌స్థ‌లం అంచ‌నాల‌ను మించి రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన రంగ‌స్థ‌లం 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 10 రోజుల్లోనే దాదాపు 100 కోట్ల షేర్ సాధించేలా.. 150 కోట్లు గ్రాస్ సాధించే దిశ‌గా స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. 

అయితే... ఈ సినిమాని చూసి పలువురు సినీ ప్ర‌ముఖులు రంగ‌స్థ‌లం టీమ్ పైన ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రంగ‌స్థ‌లం సినిమాని చూసి టీమ్‌ని అభినందించారు. అంతే కాకుండా... ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలి. అదంతా స‌క్స‌స్ మీట్లో మాట్లాడ‌తాను అంటూ భారీ స‌క్స‌స్ మీట్ నిర్వ‌హించ‌నున్నార‌ని హింట్ ఇచ్చాడు. 
 
లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...రంగ‌స్థ‌లం స‌క్స‌స్ మీట్ గురించి భారీ ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ఇక ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌ను ఈ నెల 12న హైద‌రాబాదులో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తాజా సమాచారం. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. చిరు, ప‌వ‌న్, చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురిని ఒకే వేదికపై చూస్తే.. ఫ్యాన్స్‌కి పండ‌గే..!