శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Updated : గురువారం, 3 మే 2018 (12:33 IST)

దున్నపోతుల్లా కొట్టుకుంటూ వుండండి... మోదీ చూస్తుంటారు... ఆర్‌.నారాయణమూర్తి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తిరుప‌తిలో ప్ర‌క‌టించ‌డం... ఆ త‌ర్వాత మాట మార్చ‌డం తెలిసిందే. ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం ఎంత‌గా పోరాటం చేస్తున్నా... కేంద్ర‌ ప్ర‌భుత్వం మాత

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తిరుప‌తిలో ప్ర‌క‌టించ‌డం... ఆ త‌ర్వాత మాట మార్చ‌డం తెలిసిందే. ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం ఎంత‌గా పోరాటం చేస్తున్నా... కేంద్ర‌ ప్ర‌భుత్వం మాత్రం స్పందించ‌క‌పోవ‌డం బాధాక‌రం. రోజురోజుకు ప్ర‌త్యేక హోదాపై నిర‌స‌న‌లు పెరుగుతున్నాయి.  పీపుల్ స్టార్ ఆర్‌.నారాయణమూర్తి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... "ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ తిరుపతిలో వెంకన్న సాక్షిగా చెప్పారు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. 
 
పాలకులకు ప్రజలంటే భయం, భక్తి ఉండాలి. అవి లేని నాడు వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నారు. ఈ సందర్భంగా నేను రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది ప్రత్యేక హోదా కోసం ఫైట్‌ చేస్తోంటే, మరికొంతమంది మరోలా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే, రెండు కోడిపుంజుల్లా.. రెండు పొటేళ్లలా.. రెండు దున్నపోతుల్లా కొట్టుకుంటుంటే.. మీరూ మీరూ కొట్టుకుని చావండి, మేమెందుకు ఇస్తాం ప్రత్యేక హోదా? అని కేంద్ర ప్రభుత్వం హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటోంది అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. 
 
మనకు సిగ్గుచేటు.. కాబట్టి ఓ ఆంధ్రప్రదేశ్‌ బిడ్డలారా.. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ముందుగా మీ జెండాలు పక్కన పెట్టండి. ప్రత్యేక హోదా సాధనే మీ అజెండాగా ఏకం కండి అంటూ పీపుల్ స్టార్ పిలుపు ఇచ్చారు.