మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (10:08 IST)

నీకింకా బుద్దిరాలేదా సుమంత్... నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మ : రాంగోపాల్ వర్మ

టాలీవుడ్ హీరో సుమంత్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. నీకింగా బుద్ధిరాలేదా సుమంత్ అంటూ సెటైర్లు వేశారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా 'నీకింకా బుద్దిరాలేదా సుమంత్'.. అంటూ కామెంట్ చేశాడు. 
 
నాగార్జునతో 'శివ' సినిమా తీసినప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉన్న వర్మ, 'ప్రేమకథ' చిత్రంతో సుమంత్‌ని హీరోగా టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. ఆ రకంగా సుమంత్‌తో కూడా చనువుగా ఉంటాడు. అయితే తాజాగా సుమంత్ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 
 
పవిత్ర అనే అమ్మాయితో తన పెళ్ళి జరగబోతుండగా, దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఇరువైపుల వారు.. అత్యంత సన్నిహితులకు, బంధు, మిత్రులకి 'SP' అనే అక్షరాలు హైలెట్ అయ్యేలా డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్ అందజేచేసి పెళ్ళికి ఆహ్వానించారు. 
 
ఈ నేపథ్యంలో సుమంత్ పెళ్ళిపై రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. "ఒక్కసారి అయ్యాకా కూడా నీకింకా బుద్ది రాలేదా సుమంత్, నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మ" అని రాసుకొచ్చారు. దీనికి ఓ ఏమోజీని జత చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్ అయింది. 
 
అయితే వర్మ సుమంత్‌పై ఉన్న అభిమానం, చనువుతోనే ఇలా సరదాగా కామెంట్ చేశాడని చెప్పుకుంటున్నారు. కాగా 'తొలిప్రేమ' చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ కీర్తిరెడ్డిని 2004లో సుమంత్ వివాహం చేసుకున్నారు. తర్వాత వారిద్దరి మధ్య గొడవలు జరిగి 2006లో విడాకులు తీసుకున్నారు.