శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (11:17 IST)

సమంత సెట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ట్రస్టును నడుపుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో నటిస్తూ వచ్చిన పారితోషికంతో 'ప్రత్యూష సపోర్ట్' అన్న స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, ప్రాణాపాయంలో ఉన్న చిన్నారులకు తోచినంత సాయం చేస్తూ, వారికి చికిత్సలను అందించేందుకు సహకరిస్తోంది. 
 
అయితే ఇటీవల సనా అనే పసికందు కాలేయం చెడిపోతే.. తన మిత్రబృందంతో కలిసి రూ.15లక్షలు సేకరించిన సమంత.. ఆ బిడ్డకు చికిత్స చేయించింది. ఆ డబ్బుతో వైద్యులు సనాకు కాలేయాన్ని మార్చినా ఫలితం లేకపోయింది. చికిత్స ఫలించక సనా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సమంత.. ఓ సినిమా షూటింగ్ సెట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. 
 
ఈ విషయాన్ని ''ప్రత్యూష సపోర్ట్''లో వాలంటీర్‌గా ఉన్న శశాంతా బినేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సనా చనిపోయిన రోజే సమంత పుట్టిన రోజని ఆమె భావోద్వేగానికి లోనయ్యారని చెప్పారు. ఇప్పటివరకూ తాము 547 మంది చిన్నారులను కాపాడామని, సనా ప్రాణాలు కోల్పోవడం మాత్రం దురదృష్టకరమని తెలిపారు. బినేష్ పోస్టుపై సమంత స్పందిస్తూ, శశాంక పోస్టును రీపోస్ట్ చేసింది.