మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (17:10 IST)

అది తలచుకుంటే నా హార్ట్ బ్రేక్ అవుతోంది : శ్వేతా బసు

శ్వేతా బసు ప్రసాద్. బాలీవుడ్‌లో బాలనటిగా జాతీయ అవార్డు అందుకొని 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన భామ. ఆ తర్వాత వ్యభిచారం కేసులో పట్టుబడి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన భామ.

శ్వేతా బసు ప్రసాద్. బాలీవుడ్‌లో బాలనటిగా జాతీయ అవార్డు అందుకొని 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన భామ. ఆ తర్వాత వ్యభిచారం కేసులో పట్టుబడి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన భామ.
 
అయితే, 'కొత్త బంగారు లోకం' చిత్రంలో ఈ భామకు మంచి పేరు వచ్చినప్పటికీ.. సినీ అవకాశాలు మాత్రం రాలేదు. చివరగా తెలుగులో 'మిక్చర్ పొట్లం' అనే సినిమాలో కనిపించింది.
 
సినిమా అవకాశాలు అంతగా రాకపోవడంతో సీరియల్స్‌ వైపు మళ్లింది. ఆమె హిందీలో ‘చంద్ర నందిని’ అనే సీరియల్‌లో నటించింది. అయితే ఆ సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ గురువారమే ముగిసింది. దీంతో అమ్మడు కొంచెం బాధతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. 
 
ప్రతి ప్రయాణానికి ఒక ఎండ్ ఉంటుంది ఆ విధంగానే ‘చంద్ర నందిని’ అనే సీరియల్ కూడా ముగిసింది అంటూ.. చాలా బాధగా ఉందని, చెప్పడానికి కూడా మాటలు రావడం లేదని తెలిపింది. అంతేకాకుండా అవకాశం ఇచ్చిన నిర్మాతకు సహా నటీనటులతో పాటు ప్రొడక్షన్ టీమ్‌కి ధన్యవాదాలు అని పేర్కొంది.