శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (12:10 IST)

'అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచినావురో'.. శ్రీదేవిపై రాంగోపాల్ వర్మ ట్వీట్

నటి శ్రీదేవి మృతి కేసు నుంచి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంకా బయటపడలేదు. ఆమె జ్ఞాపకాలతోనే ఆయన ఇంకా గడుపుతున్నాడు. ఈనెల 24వ తేదీ రాత్రి శనివారం రాత్రి శ్రీదేవి మరణించినట్టు వార్త తెలియగానే రాంగో

నటి శ్రీదేవి మృతి కేసు నుంచి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంకా బయటపడలేదు. ఆమె జ్ఞాపకాలతోనే ఆయన ఇంకా గడుపుతున్నాడు. ఈనెల 24వ తేదీ రాత్రి శనివారం రాత్రి శ్రీదేవి మరణించినట్టు వార్త తెలియగానే రాంగోపాల్ వర్మ దుఃఖిస్తూ తన ఆరాధ్య దేవత ఇక లేదంటూ ట్వీట్ చేశారు. అంతేనా, అందాల జాబిలిని ఇంతత్వరగా తీసుకెళ్లిన దేవుడిని ద్వేషిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. 
 
అయితే, శ్రీదేవి చనిపోయి నాలుగు రోజులు అవుతున్నా... ఆ విషాదం నుంచి రాంగోపాల్ వర్మ మాత్రం ఇంకా తేరుకోలేదు. తాజాగా తన అభిమాన నటిని ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేశాడు. 'గోవిందా గోవిందా' సినిమాలో 'అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచినావురో' అంటూ నాగార్జున పాడే పాట... శ్రీదేవిని కీర్తించడంలో అత్యున్నతమైనదన్నాడు. 
 
శ్రీదేవిని పుట్టించినందుకు బ్రహ్మను కీర్తిస్తూ పాడే పాట అది. అయితే, అదే పాటను అంత్యక్రియలకు కూడా వాడతారనే విషయాన్ని తాను ఎన్నడూ ఊహించలేకపోయానని రాంగోపాల్ వర్మ చేసిన తాజా ట్వీట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు, కింగ్ నాగార్జున కూడా ఓ ట్వీట్ చేశారు. 'అనుకున్నామని అన్నీ జరగవు... అనుకోలేదని కొన్ని ఆగవు' అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.