గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2017 (10:50 IST)

టీచర్‌గా అవతారమెత్తిన టాలీవుడ్ బ్యూటీ

టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపు పాఠాలు చెప్పి.. ఆ పాఠశాల విద్యార్థులతో పాటు.. హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్

టాలీవుడ్ బ్యూటీ ఒకరు టీచర్‌గా అవతారమెత్తారు. ఆమె ఎవరో కాదు... రెజీనా. హైదరాబాద్, అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కొద్దిసేపు పాఠాలు చెప్పి.. ఆ పాఠశాల విద్యార్థులతో పాటు.. హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్యపరిచారు.
 
ఇంతకీ ఆమె నిజంగా ఉపాధ్యాయురాలిగా మారలేదండోయ్. 'మార్పు కోసం విద్య' అనే కార్యక్రమంలో భాగంగా టీచర్‌గా అవతారమెత్తారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేష్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డి, కార్యక్రమ వ్యవస్థాపకుడు చైతన్య తదితరులు పాల్గొనగా, రెజీనా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు, విద్యా వ్యవస్థ మార్పుకోసం శ్రీకారం చుట్టే ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని, ప్రతివారంలో కనీసం 2 గంటల పాటు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతానని హామీ ఇచ్చారు. 
 
ముఖ్యంగా, లాభాపేక్ష లేకుండా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఎంతో మంది వాలంటీర్లు అవసరమని, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు నుంచి విద్యావంతులైన యువతీ యువకులవరకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీసం వారికి 2 గంటలపాటు బోధన చేయడానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు.