శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (14:51 IST)

ఎట్టలకేలకు పోలీసులకు లొంగిపోయిన వనితా రెడ్డి

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని భార్య వనితా రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయింది.

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని భార్య వనితా రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయింది. సాక్ష్యాల సేక‌ర‌ణలో భాగంగా తాను ఇంత‌కాలం లొంగిపోకుండా ఆలస్యం చేసిన‌ట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు తెలిపింది. 
 
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, విజ‌య్‌ని తాను ఎన్న‌డూ వేధించ‌లేద‌ని, సెల్ఫీ వీడియోలో త‌న పేరు ఎందుకు ప్ర‌స్తావించాడో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని వాపోయింది. తామిద్దరికీ మనస్పర్థలు తలెత్తి విడాకులు తీసుకోవాలని నిర్ణయించి కోర్టుకు వెళ్లామని, ఈకేసు కోర్టులో సాగుతుందన్నారు. 
 
విజయ్ ఆత్మహత్య కేసులో తనపై ఆరోపణలు వస్తున్నాయని, అందువల్ల ఈ కేసులో అన్ని రకాల ఆధారాల‌ను పోలీసుల‌కు స‌మ‌ర్పిస్తాన‌ని తెలిపింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న విజ‌య్‌, త‌న భార్య, మ‌రో ఇద్ద‌రు క‌లిసి త‌న‌ను వేధించార‌ని చ‌నిపోవ‌డానికి ముందు సెల్ఫీ వీడియోలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు. అప్ప‌ట్నుంచి ఆమె పరారీలో ఉన్నది.