శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (17:53 IST)

వరలక్ష్మి వచ్చేస్తోంది.. శరత్ కుమార్ అలా అనేశారేంటి?

అవును.. వరలక్ష్మీ నేరుగా తెలుగులో సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. తమిళ తెరకి కథానాయికగా పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్, ఆ తర్వాత కీలకమైన పాత్రల్లో సైతం మెప్పించింది. ఇటీవల సర్కార్, పందెంకోడి -2, మారి వంటి సినిమాల్లో తన నటనకు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులేసుకుంది. తాజాగా  తెలుగులో నేరుగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోంది. 
 
సందీప్ కిషన్ హీరోగా దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. హన్సిక కథానాయికగా చేయనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ''తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నెగటివ్ షేడ్స్ పాత్రలు ఎంచుకుంటున్న వరలక్ష్మి ఇటీవల.. రామకృష్ణ బీఏబీఎల్‌లో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో వేచి చూడాలి. 
 
ఇదిలా ఉంటే.. వరలక్ష్మి తండ్రి, నటుడు శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. దక్షిణాది స్టార్ హీరోలు, రజనీకాంత్, కమల్ హాసన్‌లు తనకు స్నేహితులమేమీ కాదన్నారు. వారిద్దరూ తన సహ నటులు మాత్రమేనని చెప్పారు.