అభిమానుల దీవెనలే దాసరి గారిని రక్షించాయి: మంత్రి తలసాని
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఇటీవల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దాసరిని పరామర్శించారు. ఈ నేపథ్
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఇటీవల అనారోగ్యం కారణంగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దాసరిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దాసరిని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దాసరి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తండ్రి లాంటి వారు. పరిశ్రమలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తారు. అంత గొప్ప వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం కలచి వేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మొరుగు పడుతోంది.
త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. వారి దీవెనలే ఆయన్ను రక్షించాయి. రెండు, మూడు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారు. ఆయన ఆరోగ్యంపై ప్రతిరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్లను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అని చెప్పారు.