ఆ ట్వీట్లో "భగవద్గీత ఆధ్యాత్మిక పుస్తకం కాదు. అందులో రాసిన కల్పిత అంశాల వల్లే సమాజం దిగజారుతోంది" అని ఉంది. ఇది చూసిన నెటిజన్లు విజయ్ సేతుపతిని తప్పుగా అర్థం చేసుకున్నారు. దీనిపై విజయ్ ప్రతిస్పందస్తూ తాను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయనని, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించనని స్పష్టం చేస్తూ అసలు విషయం బయటపెట్టారు.
తమిళనాడు పోలీసులు మొబైల్ల చోరీలను అరికట్టేందుకు ప్రవేశపెట్టనున్న కొత్త విధానాన్ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ వార్తలలో రాగా, దానిని ఎవరో ఫోటోషాప్ చేసి ఇలా చేసారని చెప్తూ ఒరిజినల్, నకిలీ రెండు ట్వీట్లను పెట్టాడు. ఇలాంటి నకిలీ వార్తల బెడద సెలబ్రిటీలకు తప్పడంలేదు.