శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (11:52 IST)

బెడ్‌పై హరికృష్ణ పార్థివదేహం. సెల్ఫీ దిగిన అనాగరిక సిబ్బంది... తిక్క కుదిర్చిన యాజమాన్యం

నల్గొండ జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ నటుడు హరికృష్ణ కామినేని ఆస్పత్రిలో చనిపోయారు. అయితే, ఆయన పార్థివదేహాన్ని ఓ గదిలో బెడ్‌పై ఉంచారు. ఆ సమయంలో కొందరు అనాగరిక మనుషులు (సిబ్బం

నల్గొండ జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ నటుడు హరికృష్ణ కామినేని ఆస్పత్రిలో చనిపోయారు. అయితే, ఆయన పార్థివదేహాన్ని ఓ గదిలో బెడ్‌పై ఉంచారు. ఆ సమయంలో కొందరు అనాగరిక మనుషులు (సిబ్బంది) హరికృష్ణ పార్థివదేహంతో సెల్ఫీ దిగారు. అనంతరం తామేదో ఘనకార్యం చేసినట్టుగా ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో నెటిజిన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విషయం కామినేని ఆస్పత్రి యాజమాన్యానికి చేరింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన యాజమాన్యం.. ఈ సెల్ఫీ పిచ్చోళ్లను విధుల నుంచి తొలగించింది.
 
తమ సిబ్బంది చేసిన పని కారణంగా హరికృష్ణ కుటుంబ సభ్యులకు.. అభిమానులకు ఆసుపత్రి క్షమాపణలు కోరింది. ఇదే విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. 'మా కామినేని ఆసుపత్రులలో మేం మా రోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల్ని చాలా గోప్యంగా ఉంచుతాం. కానీ.. మా సిబ్బందిలో కొందరు చేసిన తప్పిదం కారణంగా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లింది. ఇది మా ఆసుపత్రి యొక్క గోప్యతపై ప్రధాన దాడిగా మేం అర్థం చేసుకున్నాం. మా సిబ్బందిలో కొందరు అనాగరిక.. అమానుష ప్రవర్తన వల్ల ఈ తప్పిదం జరిగింది. 
 
ఈ విషయాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందుకు కారణమైన వారిపై చర్యలకు సంబంధిత అధికారులకు సమాచారం అందించాం. ఈ తప్పిదంలో పాల్గొన్న సిబ్బందిని మేం తగిన చర్యలు తీసుకొని తొలగించటం జరిగింది. ఇటువంటివి మళ్లీ జరుగకుండా ఉండటానికి వీలుగా తగు చర్యలు తీసుకుంటాం. మా ఆసుపత్రిలో పని చేసే కొందరి తప్పిదానికి.. మా ఆసుపత్రి తరపున హరికృష్ణగారికి, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మా హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతున్నాం అంటూ పేర్కొంది.