గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (17:11 IST)

కన్నడ ఎన్నికల బరిలో టాలీవుడ్ నటుడు

కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా కృషి చేస్తున్నాయి.

కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా కృషి చేస్తున్నాయి. అదేసమయంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. అయితే, భారతీయ జనతా పార్టీ తరపున టాలీవుడ్ హీరో సాయికుమార్ బరిలోకి దిగుతున్నారు.
 
ఈయన మంగళవారం బీజేపీ అభ్యర్ధిగా చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అధిష్టానం ఆయనకు బీ-ఫాం ఇవ్వకపోవడంతో ఆయనకు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న సందిగ్ధం ఏర్పడింది. 
 
దీనికి కారణం లేకపోలేదు. తొలుత స్థానికుడైన సి. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో సాయికుమార్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బెంగళూరులోని డాలర్స్ కాలనీలోగల యడ్యూరప్ప నివాసం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించి ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, చివరకు సాయికుమార్‌కే టిక్కెట్ కేటాయించారు.