శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:24 IST)

నాస్తిక నేత కరుణానిధి స్వర్గ ప్రాప్తినా? వేదపండితులేమంటున్నారు...

తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు చెబుతున్నారు. నాస్తికవాది అయిన కరుణాని

తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు చెబుతున్నారు. నాస్తికవాది అయిన కరుణానిధి ఏకాదశి (మంగళవారం) సాయంత్రం మృతి చెందటం, ద్వాదశి (బుధవారం)నాడు ఖననం చేయడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
నిజానికి ఏకాదశినాడు సూర్యాస్తమయం వేళ మరణించడం, ద్వాదశి ఘడియల్లో అంత్యక్రియలు జరగడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభించిందని, ఇటువంటి భాగ్యం అందరికీ లభించదని అంటున్నారు. నాస్తికుడైన కరుణ అరుదైన అదృష్టానికి నోచుకున్నారని చెబుతున్నారు. ఆయనకు మోక్షప్రాప్తి కలగాలని చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం రాజగోపురంపై పూజారులు మోక్ష దీపాలను కూడా వెలిగించడం గమనార్హం. 
 
ఇంకోవైపు, కరుణానిధిపై దాఖలైన 13 పరువునష్టం కేసులను కొట్టి వేస్తూ చెన్నై ప్రిన్సిపల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులన్నీ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన కేసులు కావడం గమనార్హం.