బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (12:39 IST)

చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ఇకపై ఉరితో మరణశాసనం

బాలికపై లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులోభాంగా, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే ఉరితో మరణశాసనం లిఖించనున్నారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశప

బాలికపై లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులోభాంగా, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే ఉరితో మరణశాసనం లిఖించనున్నారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టి దానికి ఆమోదముద్ర వేశారు.


బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే కీచకులకు మరణశిక్షను విధించే ప్రతిపాదిత క్రిమినల్ లా (అమెండ్‌మెంట్) బిల్లు-2018కు పార్టీలకు అతీతంగా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. 
 
అంతకుముందు ఈ బిల్లుపై సభలో ఏకంగా రెండు గంటల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం సభ మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది.

జమ్మూకాశ్మీర్‌లోని కతువా, యూపీలోని ఉన్నావ్‌లో ఇద్దరు చిన్నారులపై జరిగిన అకృత్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో 12 ఏండ్లలోపు పసిమొగ్గలపై అకృత్యాలకు పాల్పడితే మరణశిక్ష విధించే ఆర్డినెన్స్‌ను కేంద్రం ఏప్రిల్ 21న తెచ్చింది. అనంతరం తాజా బిల్లుకు రూపకల్పన చేసి ఆమోదముద్ర వేసేలా సత్వర చర్యలు తీసుకుంది.