శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (16:04 IST)

మోడీ.. బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం : బాలయ్య ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ప్రధాని మోడీపై బాలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ప్రధాని మోడీపై బాలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి... నిన్ను కొట్టి కొట్టి తరుముతామని, బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతామంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు బీజేపీకి రెండు సీట్లు ఉండేవని... వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని బాలయ్య జోస్యం చెప్పారు.
 
ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశానికి తెలియజేసేలా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజైన శుక్రవారం (ఏప్రిల్ 20) ధర్మపోరాట దీక్షను విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో తలపెట్టిన విషయం తెల్సిందే. ఈ దీక్షకు బాలకృష్ణ తన సంఘీభావాన్ని తెలుపుతూ నరేంద్ర మోడీపై మండిపడ్డారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఎవరెవరినో అడ్డం పెట్టుకుని వ్యవహారాలని నడిపిస్తున్నావ్.. ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించారు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానేయాని మోడీకి బాలయ్య సూచించారు. అమరావతి శంకుస్థాపనకు మట్టి, పవిత్ర జలాలను మోడీ తీసుకురావడం గురించి మాట్లాడుతూ... మా దగ్గర మట్టి, నీళ్లు లేవా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి ఆంధ్రుడు ఒక్కో 'గౌతమీపుత్ర శాతకర్ణి'లా మోడీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీని ఉద్ధరించే శక్తి కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు.