లండన్లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!
భారత్లోని ప్రభుత్వ బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల మేరకు రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా దేశం విడిచిపారిపోయిన పారిశ్రామికవేత్తలు లలిత్ మోడీ, విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా లండన్లో జరిగిన ఓ విలాసవవంతమైన పార్టీలో వీరిద్దరూ కలిసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్లో తీవ్రమన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరూ ఇలా బహిరంగంగా సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత మోడీ స్వయంగా ఏర్పాటు చేసిన ఈ పార్టీకి సుమారు 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ వేడుకలో విజయ్ మాల్యాతో కలిసి లలిత్ మోడీ.. ఫ్రాంక్ సినాత్రా పాడిన ప్రఖ్యాత ఐ డిడ్ ఇట్ మే వే అనే పాట ఆలపించారు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఈ పార్టీలో పాల్గొని లలిత్ మోడీ, మాల్యాతో దిగిన ఫోటను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఈ వీడియోను స్వయంగా లలిత్ మోడీనే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ను బ్రేక్ చేయదని ఆశిస్తున్నాత.. ఖచ్చితంగా ఇది వివాదాస్పదే. కానీ, నేను చేసేది అదే. అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ వారి ధిక్కార వైఖరి స్పష్టం చేసింది.