శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 1 మార్చి 2015 (12:59 IST)

ఆంధ్రా ఎంసెట్ తేదీల్లో మార్పు... మంత్రి గంటా శ్రీనివాసరావు..!

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడంతో ఈ ఎడాది ఎంసెట్ పరీక్షల ఆంధ్రా ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విడివిడిగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. అందుకోసం రెండు రాష్ట్రాలు తేదీలను కూడా ప్రకటించాయి. ఈ స్థితిలో మే 14న నిర్వహించనున్న ఎంసెట్ కు ఆంధ్ర రాష్ట్రం ఎంసెట్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
 
ఆంధ్రాలో ఎంసెట్ పరీక్ష జరిగే రోజుననే కే సెట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష తేదీలను మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కోరారు. ఈ నేపథ్యంలో పరీక్ష తేదీల మార్పును పరిశీలిస్తున్నామని ప్రకటించిన గంటా, త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని ఆదివారం ఆయన వెల్లడించారు.