శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (15:04 IST)

వనస్థలి పురంలో ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసిన క్రికెట్!

వనస్థలి పురంలో క్రికెట్ ఓ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఇటీవల క్రికెట్ క్రీడ ప్రాణాలు తీసే క్రీడాగా మారుతోంది. ఒకవైపు క్రికెట్ ఆడే క్రీడాకారులే ప్రాణాలను పోగొట్టుకుంటుంటే, మరో వైపు సరైన పర్యవేక్షణ లేకుండా క్రికెట్ ఆడుతూ చిన్నారులు తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్, వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్‌లో క్రికెట్ ఆడుతూ, బంతి తగిలి వంశీకృష్ణ అనే ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ క్రీడా మైదానంలో క్రికెట్ ఆడుతూ, బాల్ తగిలి గాయపడ్డ వంశీకృష్ణను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. గంటల ముందు వరకూ తమతో పాటు ఉండి, చలాకీగా ఆడుకునే బాలుడు మరణించడంతో సహారా ఎస్టేట్ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.