శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:51 IST)

ప్రియుడిని పెళ్లి చేసుకుని వచ్చింది... పట్టలేక చంపేసిన తండ్రి...

తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపంతో ఓ తండ్రి కన్నకూతురునే హతమార్చాడు. పెద్దల్ని కాదని ఇష్టపూర్వకంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రుల చేతుల్లోనే చనిపోతున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాళెంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. 
 
ఒంగోలులో డిగ్రీ చదువుతున్న కోట వైష్ణవి అనే అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఒప్పుకోలేదు. పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో తల్లిదండ్రులు అంగీకరించనప్పటికీ, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 
 
కూతురు వైష్ణవి తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తెలిసిన తండ్రి కోపంతో రగిలిపోయాడు. కన్నకూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి గొంతునులిమి హత్య చేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.