శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (10:29 IST)

ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్... నిందితుల్లో పోలీసు పుత్ర రత్నం

ఉత్తర ప్రదేశ్ లో వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. సామూహిక అత్యాచారాలు షరామామూలయ్యాయి. మహిళలపై మృగాళ్లు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. మహిళలపై అత్యాచారం జరిగింది. ముజఫర్ బాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
యూపీలోని  ముజఫర్ నగరలో ఓ మహిళపై  సామూహిక అత్యాచారం జరిగింది. ఇక్కడ నిందితుల్లో ఓ ఎస్సై కొడుకు కూడా ఉండడం ఆశ్చర్యం. దుకాణానికి  వెళ్లిన ఓ మహిళకు మత్తుమందు  కలిపిన  కూల్ డ్రింక్ ఇచ్చి, షాపు  యజమానితో సహా అయిదుగురు  ఈ దురాగతానికి పాల్పడ్డారు.  
 
పై అత్యాచార విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించినట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను  అదులులోకి తీసుకన్నారు.మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు.