శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 8 జులై 2015 (10:00 IST)

మాయమాటలు చెప్పి...! గర్భవతిని చేసి... ఆపై పక్కా మోసం

ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చిన ఓ యువతికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు ఆ ప్రబుద్ధుడు. తీరా పెళ్ళి విషయానికి వచ్చే సమయానికి ముఖం చాటేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలో కృష్ణలంక జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
కృష్ణలంక నెహ్రూనగర్ సమీపంలోని ఫీడర్ రోడ్డుపై ఉన్న ప్రముఖ ప్రైవేట్ స్కూల్ లో ఓ యువతి యేడాదిగా రిసెప్షెనిస్టుగా పనిచేస్తోంది. అదే స్కూల్ లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా గుంటూరుకు చెందిన ఎం. సురేష్ (32) మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి ఇదివరకే పెళ్లి కాగా, భార్య గుంటూరులో ఉంటోంది. 
 
సురేష్ మాత్రం కృష్ణలంక నెహ్రూనగర్ లో నివాసముంటున్నాడు. కాగా, గత ఏప్రిల్ నెలలో స్కూల్ అడ్మిషన్స్ కోసం సదరు యువతి రోజూ స్కూలుకు వచ్చేది. దీన్ని అవకాశంగా తీసుకున్న సురేష్ ఆమెను ప్రలోభపెట్టి వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇదిలా ఉండగా గత నెలాఖరున ఆమెకు తాను గర్భవతినన్న విషయం తెలిసింది. ఇద్దరూ విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. గత శుక్రవారం యువతికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆపరేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. 
 
దీంతో సోమవారం ఆమె కుటుంబసభ్యులకు అసలు విషయం తెలిపింది. కోపోద్రిక్తులైన ఆమె కుటుంబసభ్యులు మంగళవారం స్కూలుదగ్గరకు వచ్చి సురేష్ తో గొడవపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సురేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.