శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: బుధవారం, 2 మార్చి 2016 (14:49 IST)

పీలేరులో మహిళ దారుణ హత్య... కారణం ఏమిటి...?

చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని వేపులబైలు పంచాయతీ కంచెంవారిపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కంచెంవారిపల్లికి చెందిన శ్రీలక్ష్మి, భాస్కర్ లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. భాస్కర్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి శ్రీలక్ష్మి దినసరి కూలి చేసుకుంటూ పిల్లలను చూసుకుంటోంది. 
 
ఐతే బుధవారం తెల్లవారు జామున ఇంట్లో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో కొంతమంది ఆగంతుకులు ఇంట్లోకి ప్రవేశించి శ్రీలక్ష్మిని హత్య చేసినట్లు స్థానికులు చెపుతున్నారు. మహిళ హత్యకు కారణాలేమిటో తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.