శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 మే 2016 (08:45 IST)

ప్రత్యేక హోదా రావాలంటే పవన్ కళ్యాణ్ వస్తే చాలు : హీరో శివాజీ

ప్రత్యేక హోదా రావాలంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే రోడ్డుపైకి వస్తే చాలని హీరో శివాజీ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఇతర పార్టీలను కలుపుకుని ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ తాజాగా సూచించిన విషయం తెల్సిందే. దీనిపై శివాజీ స్పందించారు. 
 
గతంలో ప్రత్యేక హోదాపై ప్రశ్నించే వారందరూ దేశద్రోహులే? అని అనేక మంది అన్నారు. ఈ రోజు పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదాపై ప్రశ్నించారు.. ఇపుడు ఆయన కూడా దేశ ద్రోహేనా అని శివాజీ ప్రశ్నించారు. ఇప్పటికైనా విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించి, స్పందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
అదేసమయంలో పవన్ కళ్యాణ్ సూటిగా, ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారనీ, అధికార, ప్రతిపక్ష నేతలందరూ మీనమేషాలు లెక్కించకుండా, ప్రత్యేక హోదాపై పవన్ చొరవ చూపాలని, బహిరంగ సభ పెట్టాలని కోరారు. పవన్ కల్యాణ్ ఒక్కరు రోడ్డుపైకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా సమస్యకు పరిష్కారం నాలుగు నెలల్లో లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం అని, దేశం చక్కగా ఉండాలంటే రాష్ట్రాలు కూడా బాగుండాలని శివాజీ అన్నారు.