శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 5 జులై 2014 (18:24 IST)

అనంతపురం జెడ్పీ ఛైర్మన్‌గా దూదేకుల చమన్

అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా అనేక నేరారోపణ విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీకి చెందిన దూదేకుల చమన్ ఎంపికయ్యారు. అలాగే, సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో ఈ ఎన్నికలు పూర్తికాగా, 11 జిల్లాల్లో టీడీపీ, ఒక్క చోటా వైకాపా జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఎన్నికలు వాయిదాపడ్డాయి. జిల్లాల వారీగా జెడ్పీ ఛైర్మన్లు వీరే...
 
* అనంతపురం - దూదేకుల చమన్ (టీడీపీ)
* కర్నూలు - రాజశేఖర్ గౌడ్ (టీడీపీ)
* కడప - గూడూరు రవి (వైకాపా)
* చిత్తూరు - ఎస్. గీర్వాణి (టీడీపీ)
* నెల్లూరు - ప్రతిష్ఠంభన నెలకొంది
* ప్రకాశం - ప్రతిష్ఠంభన నెలకొంది
* గుంటూరు - షేక్ జానీమూన్ (టీడీపీ)
* కృష్ణా - గద్దె అనురాధ (టీడీపీ)
* పశ్చిమగోదావరి - ముళ్లపూడి బాపిరాజు (టీడీపీ)
* తూర్పుగోదావరి - నామన రాంబాబు (టీడీపీ)
* విశాఖపట్నం - లాలం భవాని (టీడీపీ)
* విజయనగరం - శోభా స్వాతిరాణి (టీడీపీ)
* శ్రీకాకుళం - చౌదరి ధనలక్ష్మి (టీడీపీ)