జగన్ జైలుకు ఎపుడు వెళతారో చెప్పలేరు : మంత్రి రావెల కిషోర్
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలుకు ఎపుడు వెళతారో చెప్పలేమని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసిందని, రాష్ట్ర విభజనను అడ్డగోలుగా చేసిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలను వైఎస్ మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధుల్ని దారి మళ్లించారని దుయ్యబట్టారు. ప్రజల సంపదను దోచుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి కేసుల్లో చార్జిషీట్లను ఎదుర్కొంటున్న జగన్.. చంద్రబాబు నాయుడును విమర్శించే హక్కు లేదన్నారు.