1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (15:01 IST)

ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న సుమారు 1.47 లక్షల కుటుంబాలకు ఇది ఒక శుభవార్తే. వీరికి ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల విలువ గల వైద్య సేవలు ఉచితంగా అందుతూండగా, ఇటీవల దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయం సోమవారం నుండే అమలులోకి వచ్చింది.
 
మొదట్లో తెల్లరేషన్ కార్డుదారులకు రూ.2 లక్షల విలువైన వైద్య సేవలు అందుబాటులో ఉంటుండగా, 2015వ సంవత్సరంలో దీనిని రూ.2.50 లక్షలకు పెంచారు. ఇప్పుడు ఏకంగా రెట్టింపు అయింది. దీంతో కేన్సర్, గుండె జబ్బులతోపాటు ఖరీదైన జబ్బుల బారిన పడిన పేదవారికి వైద్య ఖర్చుల రూపేణా ఉపశమనం లభించనుందని ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు ఇన్‌చార్జ్ సీఈఓ డాక్టర్‌ సుబ్బారావు తెలియజేసారు.